Thursday, 1 January 2015

మన గుంటూరు గురించి కొన్ని విషయాలు


  • ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు ధీటుగా నిలబడె ఏకైక విద్య కేంద్రం. 
  • ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వజ్రాలు " హోప్ డైమండ్" (ఇప్పుడు National Musium of Natural History, Washington DC, USA లో ఉన్నది) మరియు కోహినూర్ వజ్రాలు మన గుంటూర్ జిల్లా నుండి లభించినవే 
  • మైకా (Mica) గా పిలవబడే అబ్రకము అను లోహమును సుమారు 2200 సంవత్సరాల క్రితం మన గుంటూరు ప్రాంతంలో కనుగొన్నారు. ఆది గొప్ప తత్వవేత్త ఐన ఆచార్య నాగార్జునుడి ద్వారా అని ఒక నమ్మకం. 
  • 1868 ఆగస్ట్ 18న "Pierve Jules Cesar Janssen (1824-1907) అను శాస్త్రవేత్త సంపూర్ణ సూర్యగ్రహణ స్థితిని గుంటూరు ప్రాంతం నుండి గమనించు సమయంలో అసాధారణ నిడివిగా 10 నిమిషాల పాటు సూర్యునిలో హీలియం ఉనికిని గమనించారు. ఈ విషయం ప్రపంచ శాస్త్రవేతల చూపును గుంటూరు వైపుకు మరలేలా చేసింది. 
  • మనందరికీ తెలిసిన "టైట్యానిక్" (Titanic Ship) లో ఉన్న ఏకైక భారతీయ కుటుంబం మన గుంటూరు నుండి వెళ్లినవారే. 
  • ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ గుంటూరులో ఉంది.
  • రాష్ట్రంలో రెసిడెన్షియల్ విద్యాభ్యాసానికి నాంది పలికింది గుంటూరు.
  • U.S. లోని గొప్ప వైద్యులు మన గుంటూరు మెడికల్ కళాశాల నుండి వెళ్లినవారే.
  • ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి సుగంధ ద్రవ్యాల పార్క్ (Spices Park) మన గుంటూర్ జిల్లాలోనే నెలకొల్పబడింది.